ఖైరతాబాద్, అక్టోబర్ 28: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ సక్సెస్ నూతన చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ ప్రయోగం, విక్రమ్ ల్యాండర్ పనితీరు, చంద్ర మండలంలో ఏలియన్స్ సంచారం లాంటి మోడల్స్ను నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కలర్స్ ఉత్సవ్ మేళాలో ప్రదర్శించారు.
సుమారు 50 అడుగుల ఎత్తైన చంద్రయాన్ రాకెట్ మోడల్ ప్రత్యేక అకర్షణగా నిలువగా, కదలియాడే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చూపరులను మరింత ఉత్సాహపరుస్తుంది. చంద్ర మండలంపై 3డీ ఎఫెక్ట్స్తో రూపొందించిన ఏలియన్స్ నమూనా చిత్రాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటితో పాటు చిన్నారులకు ఆటవిడుపుగా ఉండే అమ్యూజ్మెంట్స్ రైడ్స్ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి 10 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటున్నదని నిర్వాహకుడు మీర్జా రఫీక్ బేగ్ తెలిపారు.