మల్కాజిగిరి, నవంబర్ 24: పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల అకాడమిక్ ఆఫీసర్ లతీఫ్ అన్నారు. గురువారం మౌలాలిలోని మైనారిటీ బాలికల స్కూల్లో భారత ప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలాన అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థు లు అలరించారు. ఈ సందర్భంగా అకాడమిక్ ఆఫీసర్ లతీఫ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ విద్యార్థు లు ఉన్నత చదువులు చదవడానికి వసతులు కల్పించిందని, రెసిడెన్సియల్ స్కూళ్లు ఏర్పాటు చేసిందని, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కవిత, కో ఆర్డినేటర్ సునీత, అడ్వకేట్ కవిత, లెక్చరర్ మహ్మద్ ఇర్ఫాన్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.