ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 31: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓయూ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన నవీన్ (23) ఓయూ కామర్స్ కళాశాలలో ఎంకామ్ రెండో సంవత్సరం చదువుతూ.. మంజీరా హాస్టల్లో ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నవీన్.. సోమవారం రాత్రి గడ్డికి చల్లే పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.