సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : జలమండలి చేపడుతున్న ఎస్టీపీ ప్రాజెక్టులో భాగంగా నాగోల్, అంబర్పేటలో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల్ని ఎండీ సుదర్శన్రెడ్డి బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు.
మొదటగా నాగోల్ ఎస్టీపీ వెళ్లిన ఎండీ.. అక్కడి పనులపై అధికారులను వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. తగినంత కార్మికులను ఏర్పాటు చేసుకోవాలని ఎండీ సుదర్శన్ రెడ్డి సూచించారు. సివిల్ పనులు పూర్తి చేసి ఎలక్ట్రో మెకానిక్ యంత్రాల బిగింపు పనుల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.