కవాడిగూడ, ఫిబ్రవరి 11 : మాజీ ముఖ్యమంత్రి, దివంగత రోశయ్య రాష్ర్టానికి, దేశానికి అందించిన సేవలు మరువలేనివని మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో వాసవి ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, దివంగత కొనిజేటి రోశయ్య విగ్రహాన్ని ఆయన ముషీరాబాద్, అంబర్పేట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రాష్ట్ర పర్యాటక శాఖ మాజీ చైర్మన్,
ఐవీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఐవీఎఫ్ చైర్మన్, అడ్వైజరీ బోర్డు సెంట్రల్ కమిటీ సభ్యుడు గంజి రాజమౌళి గుప్తాలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోశయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జనరల్ సెక్రెటరీ పబ్బ చంద్రశేఖర్, కోశాధికారి కొడిపాక నారాయణ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెల్లూరి మధు, గట్టు మహేశ్, కాచం కృష్ణమూర్తి, గెల్లి రమేశ్, అదనపు ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, ట్రస్ట్ కోశాధికారి గెల్లి ప్రభాకర్, ముత్యాల సత్తయ్య, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.