తెలుగు యూనివర్సిటీ, జనవరి 20 : బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఆలిండియా కేసీఆర్ సేవాదళం జాతీయ స్థాయి డే అండ్ నైట్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ సభ్యులు మహ్మద్ అమేర్ వెల్లడించారు. ఈ టోర్నీ పోస్టర్ను కేసీఆర్ సేవాదళం కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు ప్రథమ బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు అందించనున్నారు. 1వ తేదీ నుంచి నిజాం కళాశాల గ్రౌండ్లో టోర్నీలు జరుగుతాయని, ఫైనల్ మ్యాచ్ 16న ఎల్బీ స్టేడియంలో జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. టోర్నీలో పాల్గొనాలనుకునే వారు 9632984560, 9063967463 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిటుకుల మహిపాల్రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ జావీద్ పటేల్, నేతలు ఇమ్మాన్యుయేల్, అమీనా అంజుమ్, రాణి, కళ్యాణ్, మహ్మద్ నజీబుద్దీన్, జలీమ్ తదితరులు పాల్గొన్నారు.