కాచిగూడ,ఆగస్టు 20 : ఆర్టీసీ సంస్థ లాభాల బాటలో పయానించేందుకు ప్రతి ఆర్టీసీ ఉద్యోగి, కార్మికులు బాధ్యతగా కృషి చేసినప్పుడే మనుగడ సాధ్యమని కాచిగూడ డీవీఎం అపర్ణ కల్యాణి అన్నారు. ప్రయాణికులను ఆకర్శించి, సంస్థను నష్టాలోంచి గట్టెక్కించడానికి ఆర్టీసీ ఈడీ ఆదేశాల మేరకు బర్కత్పుర డిపో మేనేజర్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడ బస్ టర్మినల్, బర్కత్పుర డిపోలో కళాకారులతో విధీ నాటకాలు, ఒగ్గుకథలతో వినూత్న ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు.
అనంతరం కాచిగూడ డీవీఎం మాట్లాడుతూ.. రవాణ రంగం ప్రజలకు గుండె కాయలాంటిదని, రాబోయే రోజులలో ప్రజలకు మరింతగా చేరువలో సేవలు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థను నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు సిబ్బంది పట్టుదలతో కృషి చేయాలని ఆమె సూచించారు.
ప్రయాణికులకు భద్రత, భరోసా, సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందినప్పుడే సంస్థ పురోగతి చెందుతుందని, అందుకు సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బర్కత్పుర డిపో కార్మికులు పాల్గొన్నారు.