మన్సూరాబాద్, ఆగస్టు 15 : మలిదశ ఉద్యమకారుడు అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి త్యాగాన్ని యావత్ తెలంగాణ ప్రజలు ఏనాటికి మరువలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ రింగ్రోడ్డు సమీపంలో ఆదివారం శ్రీకాంత్చారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని తెలిపారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లిదండ్రులు కాసోజు శంకరమ్మ, వెంకటాచారి హాజరై శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేని నివాళులర్పించారు. కార్యక్రమంలో చెరుకు ప్రశాంత్గౌడ్, రుద్ర యాదగిరి, డప్పు వెంకటేష్, విజయభాస్కర్ రెడ్డి, జహంగీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.