రామంతాపూర్,ఉప్పల్ జూన్ 21 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ , నాచారం, రామంతాపూర్, చర్లపల్లి, కాప్రా, మల్లాపూర్, తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి , కార్పొరేటర్లు, నాయకులు రామంతాపూర్లోని సత్యనారాయణస్వామి , మల్లికార్జునస్వామి, కోదండ రామాలయం, ఎన్జీఆర్ఐ అభయాంజనేయస్వామి దేవాలయం, నాచారం మహంకాళి దేవాలయం, చర్చికాలనీ లూర్త్ మాత చర్చి, హబ్సిగూడలోని ఏక్మీనార్ మసీదులలో పూజలు , ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాలు అభివృద్ధి చెందాయన్నారు. కుల మతాలకు అతీతంగా ఆలయాలు, చర్చీలు, మసీదులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఉప్పల్ డీసీ అరుణకుమారి, ధర్మకర్త కోట్ల నర్సింహారెడ్డి, ఈఈ నాగేందర్, అధికారులు రమాదేవి, శ్రీనివాస్, చందన, సుదర్శన్, డీఈ నాగమణి, సాయి కిరణ్, భాగ్యలక్ష్మి, నరేంద ర్, వెంకన్నగౌడ్, కార్పొరేటర్ శాంతి సాయి జెన్శేఖర్, నాయకులు గడ్డం రవికుమార్, మేకల ముత్యంరెడ్డి, మ హేందర్రెడ్డి, పల్లెనర్సింగ్రావు, ముస్తాక్, సంతోష్రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజు, గరిక సుధాకర్, చాంద్పాషా, జగన్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. – అదే విధంగా సంధ్యారాణికి కల్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన రూ.1.116 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. రిటైర్డు ప్రొఫెసర్ బాగయ్య తదితరులు పాల్గొన్నారు.