గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు వేగవంతం చేశామన్నారు.
గురువారం అంబర్పేట డివిజన్లోని ఆకాశ్నగర్లో రూ.32 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామన్నారు.
అనంతరం బస్తీలో పాదయాత్ర చేస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈలు సుధాకర్, సువర్ణ, ఏఈ శ్వేత, వర్క్ఇన్స్పెక్టర్ దుర్గ, ఎలక్టిక్ డీఈ వెంకటరమణారెడ్డి, ఏఈ రాఘవేందర్, జలమండలి ఏఈ కుశాల్, అంబర్పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.