రంగారెడ్డి జిల్లా కోర్టులు, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు సుభాష్కు ఏడేండ్ల జైలుశిక్ష, పదివేలు జరిమానా విధిస్తూ రాజేంద్రనగర్ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్రెడ్డి కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లికి చెందిన సుభాష్ 2019, డిసెంబర్ 31న (14) ఏండ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన తల్లి బిగ్గరగా కేకలు వేయడంతో సుభాష్ పారిపోయాడు. ఆ తర్వాత బాలిక తల్లి జరిగిన సంఘటనపై రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.