వెంగళరావునగర్, మే 29 : అడిగిన డబ్బులు ఇవ్వనందుకు తల్లిపై కోపంతో కొడుకు రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..
వెంగళరావునగర్కాలనీకి చెందిన శ్రీనివాస్(45) షేర్ ట్రేడింగ్ చేస్తుండేవాడు. అందులో నష్టాలు రావడంతో ఇల్లు అమ్మి తనకు డబ్బులు ఇవ్వాలని తల్లి లక్ష్మితో తరచూ గొడవపడుతున్నాడు. తాను చనిపోతానంటూ.. ఆదివారం ఇంటి భవనం ఎక్కడంతో తల్లి డయల్ 100కు ఫోన్ చేసింది. పోలీసులు అతడికి నచ్చచెప్పి కిందకు దించారు. వారు వెళ్లిన కొద్ది సేపటికే శ్రీనివాస్ మళ్లీ గుర్తు తెలియని ద్రావణం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.