కందుకూరు : టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివిధ కుల సంఘాల నాయకులను కోరారు. సోమవారం మండల పరిధిలోని మైనార్టీ, మేదరి, ఆర్యవైశ్య, యాదవ, లింగాయత్, సంఘాల నాయకులు మంత్రిని కలిసి కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అన్ని కులాలు మతాల వారిని సమానంగా గౌరవిస్తున్నారని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కులాలను ఆదుకోవడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం ప్రతి పక్షాల మాటలను నమ్మకుండా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోక అర్ధం లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, యూత్ వింగ్ నాయకులు తాళ్ల కార్తీక్; కొలను విజ్ఞేశ్వర్రెడ్డి, బొక్క దీక్షిత్రెడ్డి, డైరెక్టర్లు సామ ప్రకాష్రెడ్డి, పొట్టి ఆనంద్ లు పాల్గొన్నారు.