హైదరాబాద్: దివ్యజనని శ్రీ శారదాదేవి(Sharada Devi) 171వ జయంతి వేడుకలు హైదరాబాద్ దోమల్గూడలోని శ్రీరామకృష్ణ మఠం(Ramakrishna Math) లో కన్నుల పండువగా జరిగాయి. ఉదయం సుప్రభాతం, మంగళహారతి, భజనలతో జయంతి వేడుకల ప్రారంభం అనంతరం దేవాలయ ప్రదక్షిణం, లలితా సహస్రనామ పారాయణం, హోమం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద (Bodhamayananda) శారదాదేవి జీవితం, సందేశంపై ప్రసంగించారు. మధ్యాహ్నం దివ్యజనని శ్రీ శారదాదేవి చలనచిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం శారదా మాత బెంగళూరు రాక్ నమూనా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం స్వాములు, భక్తులు, వాలంటీర్లు పాల్గొన్నారు.