బండ్లగూడ, ఏప్రిల్ 14: శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఓ ఫామ్హౌజ్పై దాడిచేసి, విదేశీ మద్యం పట్టుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ కథనం ప్రకారం.. శంషాబాద్ శివారు ప్రాంతంలోని అమెన్యూ సంఘీ ఫార్మ్స్లో అక్రమంగా విదేశీ మద్యం నిల్వ ఉంచినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు అదివారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 22 విదేశీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం సీసాలకు ఎలాంటి సుంకం చెల్లించడంలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో రిషబ్, జ్యోతిదేబెస్, ప్రేమ్సింగ్, నర్సింహులును అరెస్టు చేసినట్లు వెల్లడించారు.