ముషీరాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో టిఆర్ఎస్ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత జన్మదిన కేక్లు కట్ చేసి మిఠాయిలు పంచడంతోపాటు పారిశుద్ధ్య కార్మికులు, మహిళలకు చీరెలు పంపిణీ చేశారు.
గంగపుత్ర కాలనీ జీఎన్ గార్డెన్ వద్ద టీఆర్ఎస్ నాయకుడు జీ గోవింద్ ఆధ్వర్యంలో అడిక్మెట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని కేక్ కట్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు చీరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నర్సింగ్ప్రసాద్, వి.సుధాకర్గుప్త తదితరులు పాల్గొన్నారు.
రాంనగర్లో…
అదేవిధంగా రాంనగర్ డివిజన్ హరినగర్లో నాయిని నర్సింహ్మారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. పలువురికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరెలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయిని నర్సింహ్మారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు సమతారెడ్డి, ఉపాధ్యక్షుడు నాయిని దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సిరిగిరి శ్యామ్, రేశం మల్లేష్, కల్పన, శ్యామల వాయిద్ అలీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ రాంనగర్ అధ్యక్షుడు మోజస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి.