మాదాపూర్, మార్చి 31: కార్యకర్తల కృషితోనే పార్టీకి బలం చేకూరుతుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో స్థానిక కార్పొరేటర్ వి. పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్యకర్తలే పార్టీకి వెన్నెముక లాంటి వారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లి బీఆర్ఎస్ను ముచ్చటగా మూడోసారి గెలిపించి మరింత అభివృద్ధిని సాధించేలా ప్రతి ఒకరు కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లిలో అత్యధిక నిధులు రూ. 8,500 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
గౌతంనగర్, మార్చి 31/నేరేడ్మెట్ : మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10గంటలకు గౌతంనగర్ డివిజన్ లక్ష్మీసాయిగార్డెన్లో నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరవుతారు.
కందుకూరు, మార్చి 31 : కందుకూరు మండల కేంద్రంలో ఉదయం 10గంటలకు సామ నర్సింహారెడ్డి హాలులో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కానున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి.
కాప్రా, మార్చి 31: కాప్రాడివిజన్ ఎర్ర లలితా గార్డెన్స్లో శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి ని ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరుకానున్నారు.
హయత్నగర్, మార్చి 31: హయత్నగర్లోని స్వామిశంకర్ ఫంక్షన్ హాలులో శనివారం బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్ తెలిపారు.
వనస్థలిపురం, మార్చి 31 : శనివారం సాయంత్రం 6గంటలకు డీపీఎస్ గ్రౌండ్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ముఖ్య అతిథులు పాల్గొననున్నారు.
హఫీజ్పేట్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తు రూ. 216 కోట్ల 9 లక్షల 34 వేలతో 90 శాతం పనులను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. కొద్ది రోజుల్లో 100 శాతం పనులను పూర్తి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
కేంద్రం మెట్రో ట్రైన్
బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ వరకు మెట్రో ట్రైన్ కావాలని ముఖ్యమంత్రి గత ఏడేండ్లుగా కేంద్రాన్ని అడిగితే ఆ ఏరియాలో మెట్రో అవసరం లేదని లేఖ రాసినట్లు విప్ గాంధీ తెలిపారు. ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్కు పట్టం కట్టాలన్నారు.
నియోజక వర్గ అభివృద్ధి
శేరిలింగంపల్లిని అభివృద్ధి చేసేందుకు రూ. 8500 కోట్లతో 90 శాతం అభివృద్ధి పనులను చేసిన ఘనత ఎమ్మెల్యే, విప్ గాంధీకే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బండి రమేశ్ అన్నారు. రాష్ర్టానికి కేంద్రం ఏ విధంగా సహకరించడం లేదని, అయినప్పటికి సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, హఫీజ్పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొన్నారు.