బేగంపేట్/జూబ్లీహిల్స్/ అమీర్పేట్/ బన్సీలాల్పేట్/వెంగళరావునగర్ ఆగస్టు 13: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ సమైక్యత, జాతీయ భావాన్ని పెంపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సికింద్రాబాద్ సోమసుందరం వీధిలో మంజు థియేటర్ వద్ద కొత్త ఎల్లయ్య మెమోరియల్ స్కూల్, మక్తాల ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో 800 మీటర్ల జాతీయ పతాకంతో చేపట్టిన ర్యాలీని మంత్రి తలసాని హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, పాఠశాల కరస్పాండెంట్ శాంతన్కుమార్, ప్రిన్సిపాల్, జాన్సీరాణి, మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జలంధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.