హైదరాబాద్ ఆట ప్రతినిధి, ఆగస్టు 1 : హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ జలాల్లో నిర్వహించే హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ.నారాయణ ప్రకటించారు. ఆదివారం లేజర్ స్టాండర్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సెయిలింగ్లో రాణిస్తున్న ఔత్సాహిక క్రీడాకారులను ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ ద్వారా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న ఈ పోటీల్లో 12 జట్లు, 140 మంది సెయిలర్లు పాల్గొంటున్నట్లు వెల్లడించారు.