కుత్బుల్లాపూర్: కేఎఫ్సీలో చికెన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు కుళ్లిపోయిన, నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయించడంతో ఆందోళనకు గురయ్యారు. బాధితుడు నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం…26న రాత్రి పేట్బషీరాబాద్లోని కేఎఫ్సీకి నరేశ్ తన స్నేహితుడి సునీల్తో కలిసి వెళ్లాడు. ఆఫర్లో భాగంగా రూ.900 చెల్లించి చికెన్ బకెట్ కొనుగోలు చేశారు.
ఇద్దరు తమ ఇండ్లలోకి తీసుకెళ్లి కుటుంబసభ్యులతో కలిసి తిన్నారు. చికెన్ ముక్కలు పూర్తిగా కుళ్లిపోయి..ఎక్కువ రోజులు నిల్వ ఉంచినట్లు వాసన రావడంతో నరేశ్, సునీల్ కుళ్లిపోయిన చికెన్ ముక్కలను తీసుకొని కేఎఫ్సీ కేంద్రానికి వెళ్లి నిలదీశారు. నిర్వాహకులు బాధ్యాతారహితంగా సమాధానాలు ఇస్తూ దురుసుగా ప్రవర్తించారు. దీంతో నరేశ్ పేట్ బషీరాబాద్ పీఎస్లో, పుడ్సేప్టీ అధికారులు, వినియోగదారుల ఫోరం ప్రతినిధులకు ఫిర్యాదు చేశాడు.