అత్తాపూర్ : ప్రజలు ఎదుర్కుంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడలో 23లక్షల నిధులతో నిర్మించనున్న పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గత కొద్ది రోజులుగా స్థానికంగా మురుగునీటి సమస్య ఎక్కువ గాఉండడంతో అధికారులతో మాట్లాడి పైప్లైన్ను మంజూరు చేయించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ది చేసుకుందాం అన్నారు.
ఎక్కడ సమస్యలు ఉన్న నేరుగా తెలియజేయాలని సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడతానని తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. బస్తీలలో కనీస సౌకర్యాల కల్పనకు రానున్న రోజుల్లో అధికారులతో కలిసి పర్యటిస్తానన్నారు.
అనంతరం స్థానికుల కోరిక మేరకు హైదర్గూడ స్మశానవాటికను పరీశీలించిన ఎమ్మెల్యే దాని అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్, అత్తాపూర్ డివిజన్ టిఆర్యస్ పార్టీ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, నాయకులు సుభాష్రెడ్డి, కొమురయ్య, నరేందర్రావు, చిత్తారీ, పలుగుచెరువు మహేష్, శ్రావణ్, బాల్రెడ్డి, కార్తీక్, రమేష్, సిద్దేశ్వర్, మహేందర్, రాముయాదవ్, సంతోష్, హరీ తదితరులు పాల్గొన్నారు.