బడంగ్పేట : తెల్లవారు జామున ప్రధాన రహదారుల వెంట ఆటోలో నిద్రిస్తున్న సమయంలో, రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో ఆటోడ్రైవర్లను కొట్టి వారి నుంచి నగదు దొంగిలిస్తున్న ఇద్దరు దొంగలను మీర్పేట పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బదూర్పురలో నివాసముంటున్న మహ్మద్ నవాబ్(26) ఆటో డ్రైవర్ , మహ్మద్ మిస్కీన్(30) మగ్గం వర్కర్. మహ్మద్ నవాబ్ గతంలో ఎల్భీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫోన్ దొంగతనం కేసులో జైలు జీవితం గడిపాడు.
మమ్మద్ మిస్కిల్ బదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండ్ల దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. ఇటీవల ఇద్దరు జైలు నుంచి విడుదలైన అనంతరం చెడు అలవాట్లకు బానిస అయ్యారు. లగ్జరీగా జీవించాలనుకున్నారు. వీరు చేసే వృత్తిలో వచ్చిన ఆదాయం సరిపోకపోయే సరికి ఎల్భీనగర్, మీర్పేట పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధానరహదారుల్లో తెల్లవారు జామున ఆటో డ్రైవర్లు ఆటోలో నిద్రిస్తున్న సమయంలో, రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో ఆటోడ్రైవర్లను కొట్టి వారి నుంచి నగదు తీసుకుని పారిపోతున్నారు. సాంకేతిక ఆధారాలతో ఇద్దరు దొంగలను మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని టీకేఆర్ కమాన్ వద్ద పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు రూ. 900, సెవెన్ సీటర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఇద్దరిని రిమాండ్కు తరలించారు.