సిటీబ్యూరో, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డ ఓ నిందితుడికి మంగళవారం ఎమ్ఎస్జే కోర్టు 20 ఏండ్ల జైలు శిక్షను విధించింది. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర్(20) కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట్లోని ఓ పౌల్ట్రీ ఫాంలో పని చేస్తున్నాడు. అందులో పని చేసే వాచ్మెన్ కూతురి(14)కి మాయ మాటలు చెప్పి తన సొంత గ్రామానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమె మెడలో ఓ పసుపు తాడును కట్టి తానే నీ భర్తనని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఆ తర్వాత పారిపోయాడు.నిందితుడికి ఎమ్ఎస్జే కోర్టు న్యాయమూర్తి 20 ఏండ్ల జైలు శిక్ష, 20 వేల జరిమానాను విధించారు. బాధితురాలికి రూ.7 లక్షల నష్టపరిహారాన్ని బాలికకు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు.