కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 15 : మంత్రి కేటీఆర్ .. గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో బాలానగర్ డివిజన్లోని రాజీవ్గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సొంత ఖర్చులతో అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తేవడం అభినందనీయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
గురువారం బాలానగర్ డివిజన్ రాజీవ్గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ అజీద్, ప్రధాన కార్యదర్శి ఎన్కే.నరేశ్లు రూ.4.50 లక్షల సొంత ఖర్చులతో అందుబాటులోకి తెచ్చిన అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్గాంధీనగర్ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.