శంషాబాద్ రూరల్, జనవరి 27: బీఆర్ఎస్తోనే దేశంలో అనేక మార్పులు వస్తాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలం, పాలమాకుల గ్రామంలో బీజేపీకి చెందిన కవిత కృష్ణ, బాలరాజు, యాదయ్య, శ్రీనివాస్, కృష్ణ, రాజేశ్, సాయి, కార్తీక్లతోపాటు పలువుర యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీతో పాటు ఆయా ప్రాంతీయ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి పథకాలను దేశవ్యాప్తంగా అమలు కోసం సీఎం కేసీఆర్కు దేశ ప్రజలు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీరటి రాజు ముదిరాజ్, గూడాల కృష్ణయ్య, రవీందర్ నాయక్, ఉప సర్పంచ్ ప్రవీణ్గౌడ్, మండల మీడియా సెల్ అధ్యక్షుడు నీళ్ల శ్రీధర్గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గిరిగౌడ్, గూడేపే అశోక్, రాము నాయక్, తాళ్ల శ్రీశైలంగౌడ్, పాండుగౌడ్, అభిగౌడ్, రాజు, నరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బండ్లగూడ,జనవరి 27: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా రాజేంద్రనగర్ నవజ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్ల సహకారంతో కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో కబడ్డీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జట్టు, వాలీబాల్లో బండ్లగూడ జట్టు మొదటి స్థానంలో నిలిచాయి. వాలీబాల్ క్రీడాకారులకు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, డీసీపీ జగదీశ్వర్రెడ్డి, ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ క్రాంతి చేతుల మీదుగా ట్రోఫీతో పాటు రూ. 25 వేల నగదును అందజేశారు. కబడ్డీలో ప్రథమ స్థానంలో నిలచిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం హుస్సేని ముజీబ్ రూ. 25 వేల నగదును ట్రోఫీని అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.15 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 10వేల చొప్పున అందజేశారు. క్రీడా పోటీలపను నిర్వహించిన నవజ్యోతి యూత్ క్లబ్ వారిని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, పోలీసులు అభినందించారు. కార్యక్రమంలో నాగభూషణం, కార్తీక్ ప్రవీణ్ కుమార్, నవీన్, సుబ్బారావు, మహేశ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.