హైదరాబాద్ : వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు హయత్నగర్లో అత్యధికంగా 1.2సెం.మీ., ఖైరతాబాద్లో 1.0సెం.మీ., శ్రీనగర్ కాలనీలో 1.0సెం.మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
వాయుగుండం ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.