మల్కాజిగిరి, మార్చి 9 : మల్కాజిగిరి నియోజకవర్గంలోని రైల్వే క్రాసింగ్ సమస్యలు పరిష్కరించేలా చూడాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాత్సవను సోమవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కలిశారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జీఎంను కలిసి పలు అంశాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద ఆర్యూబీలు నిర్మించాలని, మచ్చబొల్లారం డివిజన్లోని రైల్వే బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే టన్నెల్ నిర్మాణం చేయాలన్నారు.
ఎల్సీ 250 బొల్లారం రైల్వేస్టేషన్ వద్ద ప్రతిపాదించిన ఆర్ఓబీ కాకుండా ఆర్యూబీ నిర్మించాలన్నారు. మల్కాజిగిరి రైల్వే స్టేషన్ పరిసరాల్లో వర్షపునీరు, డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడం వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను నివారించాలన్నారు. ఆర్కేపురం రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేగేట్ వద్ద పాదచారులు, ప్రయాణికులు సురక్షితంగా వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలన్నారు. తుర్కపల్లి, జనప్రియ మచ్చబొల్లారం, వాజ్పేయినగర్, సఫిల్గూడ ప్రాంతాల్లో ఆర్యూబీ కోసం చేసిన శంకుస్థాపనల పనుల్లో వేగంవంతం చేయాలన్నారు. సమస్యల పరిష్కారంపై తనిఖీలు చేపట్టి, పర్యవేక్షిస్తామని జీఎం హామీ ఇచ్చారని చెప్పారు. రైల్వే అధికారులు కిరణ్, శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్రెడ్డి, మేకల రాము యాదవ్, డోలి రమేశ్, ఢిల్లీ పరమేశ్, నేమూరి శ్రీధర్, అమీనుద్దీన్, చిన్నయాదవ్, హేమంత్ పటేల్, బైరు అనిల్, వెంకటేశ్, నర్సింగ్రావు, రవీందర్ పాల్గొన్నారు.