Rachakonda | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రాజేశ్, ఉపాధ్యాయురాలు మృతి కేసు వివరాలను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. రాజేశ్, ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే రాజేశ్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలిందన్నారు. వీరిద్దరి పరిచయంపై ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు.
సుజాత కుమారుడికి రాజేశ్ విషయం తెలిసిందని తమ దర్యాప్తులో తేలిందన్నారు. రాజేశ్పై సుజాత కుమారుడు దాడి చేశాడు. రాజేశ్ రోజూ సుజాత ఇంటి చుట్టూ తిరిగేవాడని తేలింది. మొదట సుజాత పురుగుల మందు తాగింది. తన తల్లి ఆస్పత్రిలో ఉందని రాజేశ్కు ఆమె కుమారుడు తెలిపాడు. తాము కలిసి బతకలేమని, ఒకరినొకరు విడిచి ఉండలేమని భావించిన వారిద్దరూ, కలిసే చనిపోవాలని అంతకుముందే నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. రాజేశ్, సుజాత మృతిపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.