CP Tarun Joshi | చర్లపల్లి, మార్చి 2 : మహిళలు తమ ప్రతిభతో పురుషులతో సమానంగా పోటీ పడుతూ ప్రపంచ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ తురుణ్జోషి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏఎస్రావునగర్ డివిజన్.. ఈసీఐఎల్ ఆఫీసర్స్ కాలనీ నుంచి ఎన్ఎఫ్సీ వరకు నాలుగు కిలోమీటర్ల వాక్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళల పట్ల వివక్ష చూపడం తగదని, మహిళా హక్కులను కాపాడి మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. షీటీమ్స్ను ఏర్పాటు చేసి సమాజంలో స్త్రీలకు ఎదురయ్యే వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. స్త్రీలు, పురుషులు సమానమని, స్త్రీలపై వివక్షను రూపుమాపేందుకు 4కే రన్ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు.
అనంతరం మల్కాజిగిరి డీసీపీ పద్మజ, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, డీసీపీ ఎస్ఓటీ రమణారెడ్డి, మురళిధర్ ప్రసగించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్రెడ్డి, కుషాయిగూడ డివిజన్ ఏసీపీ నరేశ్రెడ్డి, ఆర్కెఎస్సీ జాయింట్ కార్యదర్శి రాచమల్ల, ఆర్కేఎస్సీ వైస్ చైర్మన్ వెంకటేశ్, కార్యదర్శి రామ్, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ వీరస్వామి, కోఆర్డినేటర్స్ మన్నె అర్చన, శివ, నందిత, రజనీ, చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి, సూర్య , మహిళలు పాల్గొన్నారు.