చిక్కడపల్లి, ఫిబ్రవరి 16: ఉద్యోగుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ను 24 గంటల పాటు సరఫరా చేస్తున్నామని జెన్కో-ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ యూనియన్ వార్షికోత్సవం గురువారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ రావు అసోసియేషన్కు సంబంధించిన డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. గతంలో కరెంట్ ఉంటే వార్త అని ఇప్పుడు పోతే వార్త అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, మంత్రి జగదీశ్రెడ్డి మద్దతుతో అందరి సమష్టి కృషితో రాష్ట్రం మొత్తం నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. అసోసియేషన్ ఫౌండర్ ప్రధాన కార్యదర్శి మాతంగి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమారెడ్డి, అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పీఎం రాజు తదితరులు పాల్గొన్నారు.