కొండాపూర్ : భారతీయ ఆర్థికవేత్త, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ ఛాన్స్లర్ డాక్టర్ సీ రంగరాజన్ ప్రొఫెసర్ సీఆర్ రావు సెంటెనరీ గోల్డ్ మెడల్ -2020కు ఎంపికైనట్లు వర్సిటీ యాజమాన్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సీఆర్ రావు మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ డోయెన్, ఇండియన్ ఎకానోమెటిక్రక్ సొసైటీ (టీఐఈఎస్) వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందించారని, ఆయన 100వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశ ఆర్థిక, స్టాటిస్టిక్స్లో విలువైన సేవలందించిన డాక్టర్ సీ రంగరాజన్ను సీఆర్ రావు సెంటెనరీ గోల్డ్ మెడల్కు ఎంపిక చేసినట్లు తెలిపారు. కాగా డాక్టర్ సీ రంగరాజన్ ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మెన్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా విధులు నిర్వహించారు.