న్యూఢిల్లీ: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు(పీఐబీ) చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ అధీకృత ప్యాక్ట్ చెక్ యూనిట్గా పనిచేయనున్నది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీ నిబంధనలు-2021 కింద ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నది. ఇకపై ఫ్యాక్ట్చెక్ ఒక నోడల్ ఏజెన్సీగా ఉంటుందని, దాని పర్యవేక్షణలో కేంద్రపై తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యమని తెలిపింది. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను నోటిఫై చేయకుండా కేంద్రాన్ని నిరోధించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించిన కొద్ది రోజులకు తాజా నోటిఫికేషన్ విడుదలైంది.