మేడ్చల్,ఫిబ్రవరి 5:పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛతలో ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచిం ది. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022-23 లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘టాయిలెట్స్ 2.0’ పేరుతో చేపట్టిన సిటిజన్ ఫీడ్ బ్యాక్ సర్వేలో రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలతో పోటీ పడి పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు మౌలిక వసతుల కల్పనలో పీర్జాదిగూడ రాష్ట్రంలోనే కాదు దేశంలో అనేక నగరాలకు రోల్ మోడల్గా నిలుచింది.
దీనిలో భాగంగా ఆరోగ్యకర సమాజం స్వచ్ఛ పరిసరాలతో సాధ్యమవుతుందని కార్పొరేషన్లో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పలు ప్రాంతాల్లో మోడ్రన్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. బహిరంగ మలమూత్ర విసర్జనకు స్వస్తి పలికేందుకు ప్రధాన అంతర్గత రోడ్లలో ప్రయాణికులకు, వాహనదారులకు, ఇతర ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాంతాల్లో సుమారు రూ. 114,5 లక్షల నిధులతో13 (48సీట్లు) పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు.
ఇందులో మహిళలకు షీ టాయిలెట్స్, స్టమ్లో కమ్యూనిటీ టాయిలెట్ను నిర్మించారు. దీంతో పాటు ఇటీవల అనేక మెట్రో నగరాలతో పోటీ పడుతూ మల మూత్రాలను కూడా పునర్వినియోగం చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో ఓడీఎఫ్++సిటీగా అరుదైన గుర్తింపును దక్కించుకుని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకుంది. వీటిన పరిగణలోకి తీసుకుని ఫీడ్ బ్యాక్ సర్వేలో రాస్ట్రంలో ప్రథమ స్థానం రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పీర్జాదిగూడ కార్పొరేషన్ స్వచ్ఛతలో ఇతర కార్పొరేషన్లతో పాటీపడి ప్రథమ స్థానంలో నిలి చింది. మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్లను శుభ్రపరచడం పరిసరాలను పరిభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. బహిరంగా ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన తావులేకుండా కార్పొరేషన్ పరిధిలో అవసరం ఉన్న పబ్లిక్ టాయిలెట్స్లను ఏర్పాటు చేశాం. బహిరంగ మల విసర్జనకు స్వస్థిపలికి మూత్ర శాలలను, మరుగుదొడ్లను మాత్రమే వినియోగించుకోవాలి.
-పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్రెడ్డి
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2022-23 టాయిలెట్స్ 2.0 పేరు తో నిర్వహించిన ఫీడ్బ్యాక్ సర్వేలో పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలువడం సంతోషం. 39, 543 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 100 శాతం ఇండ్లకు టాయిలెట్స్ నిర్మాణంలో పాటు బాటసారుల సౌకార్యర్థంమున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిట్స్ను నిర్మించాం. ఇక్కడ ఉన్నవారే కాకుండా పరిసర ప్రాంతా ల వారికే కాకుండా బాటసారులు ఇబ్బందులకు గురికాకుండా కార్పొరేషన్ పరిధిలో 13 ట్రాయిలెట్లను ఏర్పాటు చేశాం.
-పీర్జాదిగూడ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావు