మేడ్చల్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త ఆటవిడుపు కోరుకుంటున్నారు నగరవాసులు.. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్నారు. ఆధునిక జీవనశైలి నుంచి ఉపశమనం కలిగించేలా అటవీ శాఖ రూపుదిద్దిన కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ సందర్శకులతో కిటకిటలాడుతున్నది. దట్టమైన అడవిలా ఉన్నట్లు అనుభూతినిచ్చే ఈ ఉద్యానవనం ఇంటిల్లిపాదికీ ఆహ్లాదాన్ని పంచుతున్నది.
మేడ్చల్ సమీపంలో 75 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2.50 కోట్లతో ఈ పార్క్ను అటవీ శాఖ అభివృద్ధి చేసింది. 2018లో ప్రారంభించారు. 30 వేల వివిధ రకాల వృక్షాలు.. 2.25 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్.. 2.00 కిలోమీటర్ల అంతర్గత ట్రాక్లు ఉన్నాయి. వాటి చుట్టూ.. పచ్చని చెట్లతో ఈ ఉద్యానవనం దట్టమైన అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నది.
పార్క్లో 35 రకాల పక్షులు ఉన్నాయి. అందులోని విదేశాల నుంచి తెప్పించిన 11 రకాల అరుదైన జాతులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు బటర్ఫ్లై రెయిన్బో గార్డెన్, సెల్ఫీ పాయింట్, నేచర్ క్యాంపు, పిక్నిక్ ఏరియా, టార్టాయిస్ పాయింట్, రచ్చబండ, ట్రీ హౌస్, డెవిల్ ట్రీ, బుద్ధ విగ్రహం, చిల్డ్రన్స్ ఆట స్థలం, యాదాద్రి మియావాకి, ఔషధ మొక్కల గార్డెన్లు సరికొత్త అనుభూతినిస్తున్నాయి.
పార్క్కు వచ్చే సందర్శకులకు నామమాత్రపు రుసుం తీసుకుంటున్నారు. పెద్దలకు రూ. 30 పిల్లలకు రూ. 20లు తీసుకుని అనుమతి ఇస్తున్నారు. ఫొటో షూట్లకు రూ. 500, వీడియో షూటింగ్లకు రూ. 2500లు చెల్లించాల్సి ఉంటుంది. వాకర్స్కు నెలకు రూ. 150.. సంవత్సరానికి రూ. 1200లుగా నిర్ణయించారు. వచ్చిన ఆదాయంతో పార్క్ నిర్వహణతో పాటు అభివృద్ధికి నిధులను వెచ్చిస్తున్నారు. అలాగే సందర్శకుల కోసం మంచినీరు, టాయిలెట్లు, వర్షంలో తడవకుండా రెయిన్ షెడ్డులను నిర్మించారు.
త్వరలోనే సైక్లింగ్ ట్రాక్తో పాటు హార్స్ రైడింగ్లను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సైకిల్ ట్రాక్ పూర్తయిందని, నామమాత్రపు రుసుంతో సైక్లింగ్, హార్స్ రైడింగ్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ హరితనిధి ఏర్పాటు చేయాలనుకోవడం చారిత్రాత్మక నిర్ణయం. హరిత నిధికి టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ సంఘం తరఫున ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నెలకు రూ.25చొప్పున చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం బాధ్యతగా భావిస్తున్నా. – మహేశ్వర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సంఘం
పర్యావరణాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరిత నిధి ఏర్పాటు చేసి మరోసారి పర్యావరణ ప్రేమికుడిగా నిరూపించుకున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సీఎం కేసీఆర్కే సాధ్యమవుతుంది. ఈ నిధి ఏర్పాటుకు అందరూ ఉత్సాహంతో విరాళాలు ఇవ్వడం శుభపరిణామం. – సలావుద్దీన్, ప్రేమ్నగర్
మొక్కలు నాటే ఉద్యమాన్ని ఉత్సాహపరిచేందుకు హరితనిధిని ఏర్పాటు చేసి ప్రతి పౌరుడిని భాగస్వామ్యం చేయడం ఆహ్వానించదగ్గ విషయం. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ స్ఫూర్తివంతమైన నిర్ణయం దేశంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలువనున్నది. -పి.రమాదేవి, గోల్నాక
ముఖ్యమంత్రి కేసీఆర్ హరితనిధి ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి బాధ్యత పెరుగుతుంది. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలన్న సంకల్పం మొదలవుతుంది. ఎవరైనా చెట్టును కొట్టాలని చూస్తే నివారించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరిలో మొక్కలు పెంచాలన్న ఆలోచన బలపడుతుంది. – గోపాల్, అధ్యాపకుడు
ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసి హరిత నిధి ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయం. హరిత తెలంగాణ కోసం ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన భావితరాలకు స్ఫూర్తినిచ్చేది. చేయి చేయి కలిస్తే హరితహారం మరింత విజయవంతమవుతుంది. – దేవేందర్, గ్రంథాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్
సీఎం కేసీఆర్ తెలంగాణలో ఇప్పటికే హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఉద్యోగ వర్గాలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా హరితనిధికి ఆర్థిక చేయూతనివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. సీఎం నిర్ణయంతో ఆకుపచ్చ తెలంగాణ సాకారం కాబోతున్నది.- కిషన్రావు, తెలంగాణ హౌస్ఫెడ్ డైరెక్టర్
సీఎం కేసీఆర్ హరితనిధిని ఏర్పాటు చేయడం చాలా మంచి నిర్ణయం. ఇది దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం లభించడం మాకు గర్వకారణం. ఉపాధ్యాయులంతా నిధి సమర్పణకు సిద్ధంగా ఉన్నారు.- మందడి వెంకట్రెడ్డి, పీఆర్టీయూ, సైదాబాద్
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, వర్షాలు సమాయానుకూలంగా కురవాలన్నా హరితవనాలు పెంచాల్సిందే. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు మొక్కలు నాటుతూ పరిసరాలను పచ్చదనంతో ఉండేటట్లు చేస్తున్నారు. రేపటితరానికి స్వచ్ఛమైన గాలిని అందించాలంటే హరితనిధి ఏర్పాటు ఆవశ్యకం. – వి. అశోక్, టీచర్, అలియా గన్పౌండ్రీ
హరితనిధి ఏర్పాటులో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు అందరినీ భాగస్వాములను చేయడం శుభపరిణామం. హరితహారం, గ్రీన్చాలెంజ్ ఇప్పటికే విజయవంతమయ్యాయి. ప్రకృతి ప్రేమికులు హరితనిధిలో భాగస్వాములు కావాలి. – అరవింద్, జీహెచ్ఎంసీ ఏఈ, ఓల్డ్బోయిన్పల్లి