హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది మే 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు లాక్డౌన్ ఉల్లంఘన కేసులు 92 వేలు నమోదు అయ్యాయని పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు వందలాది మంది నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. వేల వాహనాలను సీజ్ చేశామన్నారు. లాక్డౌన్ ఉల్లంఘన కేసులు 64,811, మాస్కు ధరించనందుకు 23,745 కేసులు, భౌతిక దూరం పాటించనందుకు 3,051 కేసులు, గుంపులు గుంపులుగా గుమిగూడినందుకు 891 కేసులు నమోదు చేశామన్నారు. ఈ లాక్డౌన్లో 22,092 వాహనాలు సీజ్ చేసినట్లు సీపీ పేర్కొన్నారు.