హైదరాబాద్: హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు మరోసారి తెరచుకున్నాయి. గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలకు పెద్దమొత్తంలో వరద నీరు వస్తున్నది. దీంతో అధికారులు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ చెరువుల గేట్లను రెండు చొప్పున ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
ప్రస్తుతం హిమాయత్సాగర్లోకి 500 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 678 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. ఇక ఉస్మాన్సాగర్ చెరువులోకి 600 క్యూసెక్కుల వరద వస్తున్నది. 442 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.