సిటీబ్యూరో, మే 5(నమస్తే తెలంగాణ): రామకృష్ణ మఠ్లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామకృష్ణ మఠ్ హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద పేర్కొన్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 11 నుంచి 18వ తేదీ రకు దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుకు కనీస అర్హత 10వ తరగతితోపాటు 15 నుంచి 60 ఏండ్లవారు అర్హులుగా నిర్ణయించారు. స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుకు విదేశీయులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో 5 స్థాయిలు ఉంటాయి. బేసిక్, జూనియర్, సీనియర్, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్-1 అండ్ 2. కాగా, విద్యార్థులు మాత్రం బేసిక్తోపాటు జూనియర్ స్థాయిల్లో జాయిన్ కావచ్చు. ప్రతి సెషన్లో మూడు నెలల పాటు మొత్తం 36 క్లాసులు ఉంటాయి.
పదవ తరగతి మార్క్స్ మెమోతోపాటు ఏదైనా గుర్తింపు కార్డు.. ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు తదితర ఐడీలను చూపవచ్చు. ఆన్లైన్ ద్వారా తరగతులను వినాలనుకునే వారు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ తరగతులకు వివేకానంద ఇనిస్టిట్యూట్కు వెళ్లి దరఖాస్తు చేసి అడ్మిషన్ పొందాల్సిందే.
స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుకు భారతీయులైతే రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. విదేశీయులకైతే రూ.4వేలు చెల్లించాలి. విద్యార్థులు మాత్రం ఈవినింగ్ కానీ, మార్నింగ్ బ్యాచ్లను ఎంచుకోవచ్చు. ఇతర వివరాలకు ఇనిస్టిట్యూట్ వెబ్సైట్ ద్వారా https://rkmath.org/spoken-english/ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు వివరాలను తెలుసుకోవచ్చు.
రామకృష్ణ మఠ్లో ఆంగ్లంతోపాటు చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, జపనీస్, సంస్కృతం అండ్ స్పానిష్ భాషల్లో శిక్షణ పొందేందుకు https://rkmath.org/otherlanguages/ వెబ్సైట్లో సంప్రదించవచ్చని చెప్పారు. ఏమైనా సందేహం వస్తే వాట్సాప్ 96035 78545 ద్వారా ఉదయం 8 నుంచి 6గంటల వరకు సంప్రదించవ్చని నిర్వాహకులు తెలిపారు.