బేగంపేట్ (హైదరాబాద్) : కరుణ, క్షమాగుణం నేర్పిన ఏసు ప్రభువు మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ (MLA Thalasani Srinivas Yadav) పిలుపునిచ్చారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను(Christmas celebration) నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం చర్చి ఫాస్టర్స్ ఆయనకు ఆశీర్వచనం చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి సౌభ్రాతృత్వం లాంటి క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ, మహేశ్వరి, హేమలతా, ఫాస్టర్లు శ్యాంసన్, విజయ్, క్రైస్తవ ప్రముఖులు ఫ్రాంక్లిన్, ప్రశాంత్, రాజ్గోపాల్దాస్, విలియమ్, జయరాజ్లో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, ఆకుల హరికృష్ణ, లక్ష్మీపతి,ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
,