మేడ్చల్, ఫిబ్రవరి 5 :అద్రాస్పల్లిలో గురువారం ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నూక రాజమ్మ అనే మహిళ ఎదురుపడి, ‘పింఛన్లు వస్తలేవు..నీళ్లు వస్తలేవు సారూ’.. అంటూ తన కష్టాలను ఏకరువు పెట్టారు. ఇందుకు స్పందించిన మల్లారెడ్డి ‘నువ్వేమి ఫికర్ పడకు అక్కా వచ్చేది కేసీఆరే.. అన్ని కష్టాలు తీరుతాయి’ అని అన్నారు. కాంగ్రెస్ సర్కారు రెండేండ్లు రాష్ర్టాన్ని ఆగం చేసింది. ఇంకా మూడేండ్లు ఈ కష్టం ఉంది. ఆ తర్వాత వచ్చేది కేసీఆరే. అప్పుడు పింఛన్లు పెరుగుతయి.. నీళ్లు వస్తయి’ అని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటేసి, గెలిపిస్తే అండగా ఉంటామని సదరు మహిళకు భరోసానిచ్చారు.