హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో ఆస్తి వివాదంలో ఓ వ్యక్తి కన్నతండ్రి, తోడబుట్టిన అన్న మీద కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఉప్పరపల్లికి చెందిన అనంతరెడ్డి అనే వృద్ధుడు తన ఆస్తిని ఇద్దరు కుమారుల రవికాంత్ రెడ్డి, ఓం రెడ్డి పేరిట రాశాడు. అయితే చిన్న కుమారుడు ఓం రెడ్డి విచక్షణ మరించి కన్నతండ్రి అనంతరెడ్డి, అన్న రవికాంత్ రెడ్డి, వదినలపై దాడికి దిగాడు.
కన్నతండ్రిని ఎందుకు కొడుతున్నావు? అని పెద్ద కుమారుడు రవికాంత్ రెడ్డి నిలదీయడంతో, మరింత రెచ్చిపోయి.. మీరు ఇక్కడి నుండి వెళ్లకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటూ వారిని బెదిరించాడు. ఓం రెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన రవికాంత్ రెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆస్తి వివాదంలో కన్నతండ్రి, అన్నపై తమ్ముడి దాడి
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో ఆస్తి వివాదంలో కన్నతండ్రి, తోడబుట్టిన అన్న మీద కిరాతకంగా దాడికి తెగబడిన వ్యక్తి
ఉప్పరపల్లికి చెందిన అనంతరెడ్డి అనే వృద్ధుడు తన ఆస్తిని ఇద్దరు కుమారుల పేరిట రాయగా.. అయితే, పెద్ద… pic.twitter.com/t0009bMXRQ
— Telugu Scribe (@TeluguScribe) June 24, 2026