ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగాలకు వేర్వేరుగా ప్రత్యేక తరగతి గదుల సముదాయాల నిర్మాణానికి అధికారులు సోమవారం శంకుస్థాపన చేశారు. పూర్వ విద్యార్థులు, సీఎస్ఆర్ కింద వచ్చిన నిధులతో ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. కాగా, ఎలక్ట్రికల్ విభాగం క్లాస్రూం కాంప్లెక్స్ నిర్మాణానికి 5 కోట్ల విరాళం ప్రకటించిన పూర్వ విద్యార్థి గోపాల్ టీకే కృష్ణ దంపతులను ఘనంగా సత్కరించారు.
– ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 4:
సిటీబ్యూరో: బల్దియాలో పారిశుధ్యం, ప్రకటన విభాగంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు రెండు హౌస్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ప్రకటనలో విభాగంలో కార్తిక్ ట్యాక్స్, అడ్డగోలు హోర్డింగ్లతో
జీహెచ్ఎంసీ ఖజానాకు వందల కోట్లు గండిపడుతున్నదని జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పారిశుధ్య విభాగంలో అక్రమాలు, స్విపింగ్ యంత్రాల వినియోగంలో అవినీతిపై కార్పొరేటర్లు ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటనలు, పారిశుధ్యంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు రెండు వేర్వేరు హౌస్ కమిటీలు వేస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు ప్రత్యేక విచారణ అధికారిని నియమించాలని కమిషనర్ను ఆదేశించారు. ఈ క్రమంలో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు చొప్పున కార్పొరేటర్లను ఎంపిక చేసి రెండు హౌస్ కమిటీలు వేశారు. ఈ మేరకు బుధవారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ రెండు హౌస్ కమిటీల
ఏర్పాటును ఆమోదించనున్నారు.