చర్లపల్లి, జూలై 25: దేశ రక్షణలో భాగస్వాములు కావడంతో పాటు కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి మొక్కలు నాటుతున్నామని డీఏ ఈ హెడ్ క్వార్టర్స్, హైదరాబాద్ డీఐజీ యామిని ప్రియా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్ఎఫ్సీ)లోని సీఐఎస్ఎఫ్ సినీయర్ కమాండెంట్ శశికాంత్ ఆధ్వర్యంలో ఆదివారం డీఏఈ కాలనీ, ప్రధాన రహదారి వెంబడి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే పండుగను నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా డీఏఈ కాలనీ, పరిశ్రమ అవరణలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడం హర్షనీయమన్నారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరంక్షించిడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. డీఏఈ హైదరాబాద్ ఏఐజీ రోహిత్ కటియార్ మాట్లాడుతూ 180 మంది యూనిట్ సభ్యు లు, 80 మంది సంరక్షిక సిబ్బందితో కలిసి వందలాది మొక్కలను నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవడం అభినందనీయమన్నారు. సీఐఎస్ఎఫ్ యూనిట్కు చెందిన ప్రతి ఒక్కరు మొక్కలు నాటే విధంగా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్సీ, ఈసీఐఎల్ యూనిట్ల సీఐఎస్ఎఫ్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.