ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 21 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని జిల్లా పీజీ కేంద్రాలలోని వివిధ విభాగాలలో పార్ట్టైం అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), ఎంలిబ్ఐఎస్సీ, ఎమ్మెస్సీ (మేథమేటిక్స్), ఎంఏ (ఎకానమిక్స్), ఎంఏ (ఇంగ్లీష్) తదితర కోర్సులను బోధించేందుకు పార్ట్టైం అధ్యాపకుల అవసరం ఉందని చెప్పారు.
ఎంబీఏ, ఎంసీఏ విభాగాలలో 60 శాతం మార్కులతో పీజీ పాసై, మిగిలిన విభాగాలలో 55 శాతం మార్కులతో పీజీ పాసై, నెట్, సెట్, స్లెట్ పరీక్షల్లో అర్హత సాధించిగాని, పీహెచ్డీ అవార్డు అయిన వారు గాని వీటికి అర్హులని వివరించారు.
రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 24వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.