సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో నోటాకు ఓట్లు భారీగా వేశారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్లో 4079 నమోదు కాగా, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 3002 ఓట్లు నోటాకు పోలయ్యాయి. అత్యల్పంగా నాంపల్లి నియోజకవర్గంలో 513 ఓట్లు నోటాకు వేశారు. కాగా, ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 48 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యల్పంగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.