సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకోవడంతో బీఆర్ఎస్ ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ అనుచరులు గూండాగిరి చేస్తున్నారు. పోలీసుల ముందే కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం చేస్తున్నారు. శుక్రవారం బోరబండ లేబర్ అడ్డా వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తుండగా నవీన్యాదవ్ అనుచరులు అడ్డుకున్నారు.
తమ ఏరియాలో మీ రెట్లా ప్రచారం చేస్తారంటూ బెదిరింపులకు దిగారు. ఆప్రాం తం లో పోలీసులు ఉన్నా కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదంటూ బీఆర్ఎస్ నా యకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.