వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 1: ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు, మారుతున్న వాతావరణ పరిస్థితులలో మనలో ఆనందాన్ని తెచ్చే హోళీకి ప్రపంచ గుర్తింపు. చలినుంచి ఎండలకు వసంతకాలం ఆరంభమౌతుంది. అనారోగ్యం నుంచి ఉపసమనం పొందేందుకు వసంత కేలి, వెనుకటి రోజుల్లో వేప, మోడుగ, బంతి, గులాబి, బిల్వా, మందారం వంటి ఔషద గుణాలున్న చెట్ల ఆకులు, పూల పొడులు, పసుపు, కుంకుమ, కలిపి చల్లుకునేవారని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహజ రంగుల విభాగం శాస్త్రవేత్తలు సూచించారు. మానవ శరీరాన్ని చల్లబర్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఈ రంగు భావోద్వేగాల మీద ప్రభావం చూపుతుంది.
పరిశోధనలు, నవ్వుతూ, కేరింతలు స్నేహితులతో ఆడుకోవడం హాపీహార్మోన్స్ విడుదలౌతాయన్నారు. వత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతతనిస్తోందన్నారు. కృత్రిమ రంగుల వల్ల కళ్లు, జుట్టు, చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. హోళీ ఆడే ముందుగానే ఒళ్లుకు కొబ్బరి నూనె, లేదా ఆలివ్ నూనె పూసుకోవాలి. అతి సున్నితమైన కళ్లు, చెవులు, గోళ్ల దగ్గర, జుట్టుకు పూసుకోవాలన్నారు. ఏడాదికోసారి వచ్చే పండుగ, వేసవిలో.. సరదాగా , సంతోషంగా బంధాలను గుర్తు చేస్తోందని ఎన్డీపీఐసీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇన్చార్జి లక్ష్మీపూజ సూచించారు. సరసమైన ధరలకు రూ.25 నుంచి రూ.425కు వివిధ రంగులలో అందుబాటులో ఉన్నాయన్నారు. తమ వద్ద స్టాక్ ఉన్నంత వరకే విక్రయిస్తామన్నారు.