మెహిదీపట్నం, మార్చి 10: ప్రజల సమస్యలను పరిష్కరించడాని కృషి చేస్తున్నామని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం మెహిదీపట్నం డివిజన్ పద్మనాభనగర్ కాలనీలో ఎమ్మెల్యే ఎంఐఎం నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడారు. రంజాన్ మాసం సమీపిస్తుండటంతో నీరు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో మాట్లాడి సమస్యలు రాకుండా చూస్తామని హమీ ఇచ్చారు.
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అధికారులు కృషి చేయాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. శుక్రవారం టోలిచౌకి డివిజన్లోని ఎండీ లైన్స్, అక్బర్పురా ప్రాంతాల్లో ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి మహ్మద్ హరూన్ ఫర్హాన్తో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
నాంపల్లి నియోజకవర్గం రెడ్హిల్స్ డివిజన్ చింతల్బస్తీలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి సర్కిల్ -12 ఇంజినీరింగ్ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం దోభీ ఘాట్ చింతల్బస్తీ , అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో వీడీసీసీ రోడ్డు నిర్మాణానికి రోడ్డు తవ్వకాలు పూర్తి చేశారు. పనులను ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ ఆదేశాలతో ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి ఆరిఫ్ రిజ్వాన్ సూచనలతో స్థానిక నాయకులు ఠాకూర్ దేవేందర్ సింగ్ పరిశీలించారు.