సుల్తాన్ బజార్, అక్టోబర్ 7: తెలంగాణలో అతి పెద్ద పండుగైన దసరా పండుగను ముందస్తుగా ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ పత్రికల ఆధ్వర్యంలో వినియోగదారులు ఘనంగా జరుపుకుంటున్నారు. గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న దసరా బొనాంజలో లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. డ్రాలో ఎంపికైన విజేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గచ్చిబౌలిలోని చందన బ్రదర్స్లో షాపింగ్ పూర్తి చేసిన అనంతరం, అక్కడ ఉన్న సిబ్బంది సూచన మేరకు దసరా బొనాంజా లక్కీ డ్రా కూపన్ను నింపడంతో ఆరో రోజు లక్కీ డ్రాలో మొదటి బహుమతి వచ్చిందని ఎల్ఈడీ టీవీ విజేత అయిన కోకాపేట వాసి ప్రియాంక రావు సంతోషం వ్యక్తం చేస్తూ తెలిపారు. ఏమొస్తదో.. అసలు రాదులే అనుకొని కూపన్ నింపానని, లక్కీ డ్రాలో బహుమతి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. ఈ మేరకు గురువారం ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ల సంయుక్తాధ్వర్యంలో దసరా బొనాంజా వేడుకలలో ఆరో రోజు ఏసీ గార్డ్స్ లక్డీకాపూల్లోని కున్ హుందాయ్ షోరూమ్లో లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు.
డ్రాలో కోకాపేటకు చెందిన ప్రియాంక రావుకు మొదటి బహుమతి, జి.సంతోష్కు రెండో బహుమతి, ఫిలోమెనాకు మూడో బహుమతి, సునీల్కు నాల్గవ బహుమతి, బి.శైలజ ఐదో బహుమతులను గెలుచుకొని విజేతలుగా నిలిచారు. కున్ హుందాయ్ సీఈవో అశోక్ మాట్లాడుతూ నాలుగేళ్ళుగా ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ల ఆధ్వర్యంలో దసరా బొనాంజా ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. కున్ హుందాయ్ వినియోగదారులకు ఈ లక్రీ డ్రాలో మూడు బహుమతులు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
నమస్తే తెలంగాణ ఆపరేషన్స్ సీజీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ దసరా బొనాంజతో ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ పాఠకులకు, ప్రకటనకర్తలకు మరింత ప్రోతాహాన్ని అందించేందుకు ఈ బొనాంజా దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో కున్ యునైటెడ్ హుందాయ్ జీఎం పూర్ణిమా, ఏజీఎంలు సంతోష్, కార్తీక్, ‘నమస్తే తెలంగా ణ – తెలంగాణ టుడే’ల అడ్వైర్టెజ్మెంట్ జీఎం సురేందర్ రావు, ఏజీఎంలు రాజిరెడ్డి, శ్యాం, చరణ్, శ్రీనివాస్ తదితరులు
పాల్గొన్నారు.
దసరా పండుగ షాపింగ్కు వెళితే.. 32 ఇంచుల కలర్ టీవీ లక్కీ డ్రాలో గెలుచుకోవడం ఊహించని పరిణామం. ఫోన్ చేసి ఆరో లక్కీ డ్రాలో మొదటి విజేతగా నిలిచావని ‘నమస్తే తెలంగాణ’ యాజయాన్యం తెలపడంతో ఆశ్చర్యానికి లోనవడంతో పాటు చాలా ఆనందంగా ఫీలయ్యాను. ఇటువంటి అవకాశాలను ఎవ్వరూ వదులు కోవద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ షాపింగ్ చేసి లక్కీ డ్రాలో విజేతలుగా నిలవాలన్నారు.- ప్రియాంకారావు, మొదటి బహుమతి విజేత, కోకాపేట
వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ఒకసారి వచ్చిన వినియోగదారుడికి అణుగుణంగా ఉం డేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కున్ యునైటెడ్ హుందాయ్ 20వ వార్షిక వేడుకలలో భాగంగా ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ల ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న దసరా బొనాంజాలో వినియోగదారులను భాగస్వాములను చేసి బహుమతులు అందించడం సంతోషంగా ఉంది. మా షోరూమ్కు చెందిన ముగ్గురు ఈ బొనాంజాలో బహుమతులను గెలుచుకోవడం సంతోషకరం. నమస్తే తెలంగాణకు ప్రత్యేక కృతజ్ఞతలు. – అశోక్, సీఈవో – కున్ హుందాయ్
‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ల ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న దసరా బొనాంజాతో పాఠకులకు, ప్రకటనకర్తలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. వినియోగదారులు దగ్గరయ్యేందుకు ఈ వేడుక దోహదం చేస్తుంది. ఈ లక్కీ డ్రాకు విశేష స్పందన రావటంతో రాబోయే యేడాది మరింత పెద్ద ఎత్తున ఈ పండుగను నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఆపరేషన్స్ సీజీఎం, నమస్తే తెలంగాణ