హైదరాబాద్ : ఎన్నికల సమయంలో కరెంట్ బిల్లులు(Electricity Bill) తామే కడతామని చెప్పిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని నాగోల్(Nagole) ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 యూనిట్ల కరెంట్ బిల్లు మాఫీ(Free) చేస్తామని ఇచ్చిన హామీ అమలు కావడం లేదని పేర్కొంటూ నాగోల్లోని పోస్టుబాక్స్లో సోనియాగాంధీ(Sonia Gandhi) ఇంటికి కరెంట్ బిల్లులు మీరు చెల్లించాలని కోరుతూ శుక్రవారం పోస్టు కార్డులు(Post Cards) పంపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడ్డాక రెండు సార్లు కరెంట్ బిల్లులు చెల్లించామని ఆ లెటర్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి మాట్లాడుతూ కర్నాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా గృహ విద్యుత్ దారులందరికీ 200 యూనిట్లు వరకు బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక బస్తీ నుంచి కేవలం పదుల సంఖ్యలో ఉత్తరాలు వచ్చాయని, ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే లక్షల్లో ఉత్తరాలు పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సతీష్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, షఫీ తదితరులు పాల్గొన్నారు.