కేపీహెచ్బీ కాలనీ, మార్చి 16 : ఆస్తిపన్ను చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుందని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. బుధవారం సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆస్తిపన్ను వసూళ్ల తీరును డీసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్షిక యేడాది వారం రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో బకాయిదారులంతా ఆస్తిపన్ను చెల్లించాలని కోరారు. ఆస్తిపన్ను చెల్లించని వారికి నోటీసులు జారీ చేస్తూ చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సన్నద్దమవుతున్నామని తెలిపారు.